‘ఉత్తమ్ మూర్ఖుడా..నాయకుడా?’
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఉత్తమ్ నాయకుడా, మూర్ఖుడా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ మూర్ఖుడయితేనే భూసేకరణకు తొందరేమిటని మాట్లాడతారన్నారు. భూసేకరణకు కచ్చితంగా తొందర ఉంటుందని, అందుకే ఆదివారమైనా అసెంబ్లీ పెడుతున్నామని తుమ్మల అన్నారు. ఎపుడు ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల శ్రీరంగ నీతులు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని, లుచ్చా, లఫంగి పాలనలో ఎపుడైనా ఇప్పుడిస్తున్న ధరలు రైతుల పంటల కిచ్చారా అని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు