రూ.800 కోట్లు నష్టపోయాం: కవిత
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు అంశంతో రాష్ట్రానికి నష్టాలొచ్చాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత తాజాగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.800 కోట్లు నష్టపోయిందని కవిత అన్నారు. లోక్సభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్లను రూ.200 నుంచి రూ. 500లకు పెంచాలని కేంద్రాన్ని ఆమె కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు