డబ్బులిచ్చి అవార్డులు తెచ్చుకున్న కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై ఉత్తమ్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్లో పేర్కొన్న వివరాలన్నీ తప్పుడు లెక్కలని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల్లో నెంబర్ వన్ చేయడంలో కేసీఆర్ విజయం సాధించారే తప్ప ఎక్కడా ప్రగతి సాధించలేదని దుయ్యబట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనీ, ముందస్తు ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు