విశాఖ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని శారదానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఇంట్లో కత్తులతో ప్రవేశించిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లో ఉన్నకాడికి దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో 15 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ. 10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top