హైదరాబాద్లో పరువుహత్య కలకలం
హైదరాబాద్లోనూ పరువు హత్యల సంస్కృతి మొదలైంది. నగరానికి శివార్లలో ప్రశాంతంగా ఉండే వనస్థలిపురం ప్రాంతం తెల్లవారుజామునే ఉలిక్కి పడింది. ఇక్కడి సచివాలయ నగర్ ప్రాంతంలో ఉండే లలిత్ ఆదిత్య (28) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గత సంవత్సరం నవంబర్ 9వ తేదీన సుశ్రుత అనే అమ్మాయిని అతడు ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ హత్య వెనుక ఆమె తరఫు బంధువుల హస్తం ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తమ అమ్మాయిని లలిత్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే వాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు