ఎంసెట్-2 రద్దుకే ప్రభుత్వం మొగ్గు?
తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ -2 పేపర్ లీకేజి వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లను కూడా విచారించినట్లు తెలుస్తోంది. కొందరు కన్సల్టెన్సీల బ్రోకర్ల కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, కనిగిరి తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. సీఐడీ ప్రత్యేక బృందాలు వెళ్లి గాలింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే నలుగురు విద్యార్థులను విచారించిన సీఐడీ అధికారులు.. మరో 60 మంది వరకు విద్యార్థులను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటం.. వైద్య విద్యకు సంబంధించిన క్లాసులను కూడా ప్రారంభించాల్సి రావడంతో వీలైనంత త్వరగా ఈ పరీక్ష విషయమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎంసెట్ మెడికల్ పరీక్షను రద్దు చేయడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు