మరో 5 ఎకరాలు ఇస్తాం: సీఎం

దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా రెడ్డి హాస్టల్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్‌ నిర్మాణ సముదాయానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... రెడ్డి హాస్టల్‌కు ఇప్పటికే కేటాయించిన 10 ఎకరాలకు తోడుగా మరో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీయిచ్చారు. నారాయణగూడలో బాలికల హాస్టల్‌కు అదనంగా 1500 గజాలు ఇస్తామన్నారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భారీ ఎడ్యుకేషన్‌ టవర్‌ నిర్మించి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు జరిగేలా చూడాలని కోరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top