కృత్రిమ నేత నారా లోకేశ్ ఎక్కడ?
వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ సభలకు స్వచ్ఛందంగా తరలివస్తున్న జనాలను చూసి అధికార పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. సభలకు జనం రాకుండా చేయాలనే కుట్రతో డబ్బులిచ్చి ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు. కృత్రిమ నేత నారా లోకేశ్ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞత కోల్పోతున్నారని, కార్యకర్తపై ఆయన చేయిచేసుకోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి డబ్బు పంచడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాజకీయాలను చంద్రబాబు దిగజారుస్తున్నారని మండిపడ్డారు. భూమా కుటుంబాన్ని వైఎస్ జగన్ అన్నివిధాలుగా ఆదరిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు