జంతువధ నిషేధంపై కేంద్రానికి ఎదురుదెబ్బ
పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జంతువధ నిషేధంపై కేంద్రంజారీ చేసిన సర్క్యులర్పై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. ఎద్దులు, దున్నపోతులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, కోడెలు, దూడలు తదితర పశువులు వేటినీ మాంసం కోసం వధించడానికి లేదా మతావసరాల కోసం వధించడానికి విక్రయించడాన్ని కేంద్రం తాజాగా నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు సమర్ధించింది. అనిశ్చితి కారణంగా ప్రజల జీవనాధారానికి ఇబ్బంది కలగకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు