శబరిమలలో మహిళల ప్రవేశానికి ఓకే
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అన్ని వయసుల మహిళలు చారిత్రక శబరిమల ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. గత జూలైలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ కేరళ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ను సమర్పించింది. అయితే తాజా విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మద్దతుగా 2007లో తాము దాఖలు చేసిన అఫిడవిట్కు కట్టుబడి ఉన్నట్టు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు