మాజీ కార్పొరేటర్‌ నివాసంలో రూ.40 కోట్లు

బెంగళూరులో ఓ మాజీ కార్పొరేటర్‌ నివాసంలో పెద్ద ఎత్తున దొరికిన పాతనోట్లను చూసి పోలీసులే అవాక్కు అయ్యారు. వివరాల్లోకి వెళితే.... మాజీ కార్పొరేటర్‌ వి నాగరాజ్‌ నివాసంలో శుక్రవారం పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.40 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అంతకు ముందు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు లాక్‌ పగలగొట్టి లోనికి వెళ్లగా, అక్కడ గదుల్లో పెద్ద ఎత్తున నగదు గుట్టలుగా పడి ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top