మోదీకి పద్మాసనం రాదు : రాహుల్‌ గాంధీ

స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కష్టపడి బలోపేతం చేసిన ప్రజా వ్యవస్థలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రెండున్నర ఏళ్లల్లోనే ధ్వంసం చేశాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ పేదలతో ఏనాడూ మాట్లాడలేదని, ప్రజల సమస్యలకు ఆయనకు తెలియవని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతో మాత్రమే ‘అచ్ఛే దిన్‌’(మంచిరోజులు) వస్తాయని అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జన వేదన సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షడు.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. యావతత్‌ దేశాన్ని ఒక్క మోదీనో, మోహన్‌ భగవతో తమ ఇష్టానుసారంగా పాలిస్తామంటే అంగీకరించబోమని హెచ్చరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top