రా​‍ష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం ప్రముఖులకు ‘ఎట్‌ హోం’ తేనీటి విందును ఏర్పాటు చేశారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి వారం క్రితం హైదరాబాద్‌ నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి విడిది ముగింపు సందర్భంగా జరిగిన ఎట్‌ హోంకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ​క్షుడు ఎల్‌.రమణ, పలువురు మంత్రులు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top