టీడీపీ నేతలపై ప్రకాశ్‌ జవదేకర్ ఆగ్రహం

బీజేపీ-టీడీపీ పొత్తు అంశం ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. టీడీపీలో రెబల్ అభ్యర్థులు క్రమేపీ పెరుగుతుండటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. బీజేపీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో చంద్రబాబు నాయుడి వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టీడీపీకి పొత్తు ధర్మం తెలుసా?అంటూ నిలదీశారు. టీడీపీ అభ్యర్థుల గురించి బీజేపీ అడగనప్పుడు వారు తమ స్థానాల్లో పోటీకి దింపడమేమిటని జవదేకర్ ప్రశ్నించారు. ఆ పార్టీకి చెందిన మీడియాలో లీకులేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల గురించి తమ నాయకులు ముందే చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.

బీజేపీ-టీడీపీల పొత్తు అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ అభ్యర్థులు తిరుగబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన టీడీపీ అభ్యర్థులు.. నామినేషన్ల కార్యక్రమంలో రెబల్స్ గా మారి చంద్రబాబుకి షాక్ ఇస్తున్నారు. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీకి 14 స్థానాలు కేటాయించారు. అయితే టీడీపీ నేతలు రెబల్ అభ్యర్థులుగా మారడంతో పార్టీకి తలనొప్పిగా మారాయి. బీజేపీకి కేటాయించిన స్థానాలకు గాను ఆరు చోట్ల నామినేషన్లు వేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top