ఎంఈవోపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

గుంటూరు జిల్లాలో ఓ పోలీస్ అధికారి అహంకారాన్ని ప్రదర్శించాడు. వివరాలు.. జిల్లాలోని తాడేపల్లి ఎంఈఓ ఆఫీసులో ఎంఈఓ రాయల సుబ్బారావుపై పెదనందిపాడు ఎస్‌ఐ కోటయ్య చేయి చేసుకున్నాడు. ఎంఈఓ సుబ్బారావుపై పెందనందిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఈ కేసు నిమిత్తం సుబ్బారావును అరెస్ట్ చేసి తీసుకువెళ్లడానికి ఎస్ఐ ప్రయత్నించగా.. సుబ్బారావు అరెస్ట్‌పై స్టే ఉందని తెలిపాడు. ఈ విషయంలో వాగ్వివాదం జరిగి ఎస్‌ఐ కోటయ్య, ఎంఈవో పై చేయిచేసుకున్నాడు. తోటి ఉద్యోగులు ఎస్‌ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top