బినామీ చట్టంలో మార్పులు తప్పవు: మోదీ
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ పథకాలను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా తెలియజేశారు. వీటి ద్వారా చిన్నచిన్న వ్యాపారులు, వినియోగదారులు లబ్ధి పొందనున్నట్లు మోదీ చెప్పారు. దీనిని దేశ ప్రజలకు క్రిస్మస్ బహుమానంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలకు తొలుత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు