జయ మృతిపై హైకోర్టుకు అనుమానాలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని, తనుకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరినప్పడు ఆమె బాగానే ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారని గుర్తు చేశారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడికావాలన్నారు. కేసును రెగ్యులర్ బెంచ్ కు న్యాయమూర్తి బదిలీ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు