నంద్యాలది ధర్మయుద్ధం...

నంద్యాలలో జరుగుతున్నది ఉప ఎన్నిక మాత్రమే కాదని ధర్మయుద్ధమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కేబినెట్‌ మొత్తం కూడా నడి నంద్యాలలో ఉందన్నారు. చంద్రబాబు ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడే తిష్ట వేశారని, చివరకు చంద్రబాబు, ఆయన కొడుకు నంద్యాల రోడ్ల మీద తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top