రైల్లో వెళ్లాలంటేనే భయం వేస్తోంది!

గడిచిన మూడు నెలల్లో మూడు రైలు ప్రమాదాలు జరిగాయని, ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైలు ప్రమాద బాధితులకు ఏదో నామమాత్రంగా కాక.. కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కూనేరు వద్ద రైలు ప్రమాదం సంభవించిన సంఘటనా స్థలాన్ని ఆయన సోమవారం సాయంత్రం సందర్శించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది విద్రోహచర్య అయినా, రైల్వేశాఖ తప్పయినా.. అసలు తప్పు మాత్రం ప్రభుత్వానిదేనని, గమ్యం చేరుకోకుండానే ప్రయాణికులు మరణించడం దారుణమని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top