ఆ నిర్ణయం ఒక క్లీన్‌నెస్‌ డ్రైవ్‌

తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యం అభివృద్ధే అని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తాను నిరంతరం పనిచేస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందన్నారు. ధనవంతులు, కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పని చస్తున్నారన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ పరివర్తన్‌ మహార్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. రూ. 12 వేల కోట్ల విలువైన 900 కి.మీ. చార్‌ధామ్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top