స్పీకర్పై అవిశ్వాస తీర్మానం!
ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను గౌరవించని స్పీకర్ మధుసూదనా చారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రకటించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, టి.జీవన్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జి,చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, రామ్మోహన్రెడ్డి తది తరులు సోమవారం అసెంబ్లీ వాయిదా అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ప్రజాస్వామ్య విలువలను, ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయాన్ని స్పీకర్ ఉల్లంఘించారని జానారెడ్డి ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు