మరోసారి కిందకు దిగిన ఎన్ హెచ్ బ్రిడ్జ్!

హైదరాబాద్ టూ విజయవాడ మార్గాన్ని కలిపై జాతీయ రహదారి (ఎన్ హెచ్) బ్రిడ్జిలో మరోసారి కదిలిక వచ్చింది. గత కొన్నేళ్లుగా ఏదో సమయంలో ఈ బ్రిడ్జి కొద్ది కొద్దిగా కిందకు దిగుతూనే ఉంది. తాజాగా కీసర 6వ బ్లాక్ బ్రిడ్జి స్వల్పంగా కదలడంతో కలవరం మొదలైంది. ఆ బ్రిడ్జి అర అంగుళం మేర కిందకు దిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్లలో ఈ బ్రిడ్జి మూడో సారి కిందికి దిగినా టోల్ ప్లాజా అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పుణ్యమా అని ఈ బ్రిడ్జి క్రమేపీ కిందకు దిగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top