ఇక సెలవంటూ.....
మహామనిషి మహాభినిష్క్రమణం. బంధువులు, అభిమానులు, అనుచరులు కడసారి వీడ్కోలు పలకగా ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బంధువులు, అభిమానులు, అనుచరులు తరలి రాగా మిస్సైల్ మ్యాన్కు భారతావని వీడ్కోలు పలికింది. ముద్దుబిడ్డను మాతృభూమి శోకతప్త హృదయంతో సాగనంపింది. సొంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి కావాలన్న కలాం ఆకాంక్ష మేరకు ఆయన సొంత గడ్డపైనే అంత్యక్రియలు జరిగాయి.
కలాం అంత్యక్రియలకు వీవీఐపీలతో పాటు రాజకీయ, శాస్త్ర-సాంకేతిక రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. కేరళ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు