గంగమ్మ తల్లే ఆహ్వానించింది: మోడీ
వారణాసిలోని ముస్లిం చేనేత కార్మికులను ఆదుకుంటానని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. వారణాసి లోకసభకు గురువారం నామినేషన్ చేసిన తర్వాత గంగా, యమున సంగమానికి నివాళులర్పించారు. వారణాసి నగరాన్ని అంతర్జాతీయ అధ్యాత్మిక రాజధానిగా చూడాలని ఉందని మోడీ అన్నారు. నాకు ఎవరూ చెప్పలేదు. నన్నెవరూ రమ్మని అనలేదు. కేవలం గంగమ్మ తల్లి ఆహ్వానించిందని మోడీ అన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు లభిస్తాయని మోడీ అన్నారు.
గుజరాత్ లో పతంగి తయారు చేసే ముస్లింలను తాను ఎలా ఆదుకున్నతీరును మోడీ వివరించారు. గుజరాత్ లో సబర్మతీ నదిని శుభ్రం చేసినట్టే.. గంగానదిని కూడా పరిశుభ్రం చేస్తానని మోడీ తెలిపారు. వారణాసి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు తాను ధన్యుడిని అని మోడీ అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు