ఓటమి భయంతోనే బాబు కుట్ర ప్రచారం: బొత్స

ఇంటెలిజెన్స్‌ వర్గాలు, పార్టీ శ్రేణుల రిపోర్టుల ప్రకారం టీడీపీ ఓటమి తప్పదని సీఎం చంద్రబాబు గుర్తించారని, అందుకే నంద్యాల ఉప ఎన్నికలో దౌర్జన్యాలు, కుట్ర సిద్ధాంతాలకు తెరలేపారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు వాయిదా పడేలా ప్రతిపక్షం కుట్ర చేస్తోందంటూ సీఎం మాట్లాడటం ఆయన బేలతనాన్ని బయటపెట్టుకున్నట్లుందని బొత్స ఎద్దేవా చేశారు. శనివారం నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘వైఎస్సార్‌సీపీ నేతలు, ఆర్యవైశ్యులు, రజకుల ఇళ్లపై పోలీసులు ఏకపక్షంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి మాత్రం డబ్బు పంపకం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇస్తానన్నారు. నిజంగా దేశంలో ఏ ముఖ్యమంత్రీ చంద్రబాబులా దిగజారి మాట్లాడి ఉండరు. ఆయన కుట్రలను అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు ఆటలను సాగనివ్వబోము. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయిపోయారు’’

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top