ఇంటికో కేజీ బంగారం ఇస్తామంటారేమో!

ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తొస్తారని, మూడేళ్ల కిందట ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోగా, కొత్త హామీలిస్తూ నంద్యాల ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆరో రోజు నంద్యాల పట్టణంలో ఆయన పర్యటించారు. స్థానిక గిరినాథ్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అక్రమాలు చేసి సంపాదించిన డబ్బుతో 21 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు .. ప్రజలను కూడా కొనేయొచ్చనే అహకారంతో వస్తున్నారని జగన్‌ మండిపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top