రూ.10 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే

సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి విడతగా రూ.10 కోట్లు చెల్లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి గురువారం ఆ మేరకు నగదును చెల్లించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు చెల్లింపు వివరాలను అందజేసినట్లు ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. మరో 17 కోట్ల రూపాయలు నిర్ణీత గడువులోగా చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ నెల 17న సదావర్తి భూముల వేలం కేసును హైకోర్టు మరోసారి విచారించనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top