పారాణి ఆరక ముందే ప్రేమ జంట ఆత్మహత్య
పారాణి ఆరక ముందే ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మల్లన్నగుట్ట మల్లికార్జున స్వామి సన్నిధిలో పసుపు కొమ్ము కట్టుకుని పెళ్లి చేసుకున్న కొన్ని గంటల సమయంలోనే ఈ అఘారుుత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం బస్వాపూర్కు చెందిన నాచారం సుగుణ, కుమారుడు రమేశ్ (24) బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం అదే మండలంలోని దూలపల్లికి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గంగోజిపేటకు చెందిన కుమ్మరి లింగయ్య, లక్ష్మి దంపతులు ఐదేళ్ల క్రితం దూలపల్లికి వలస వెళ్లి ఓ కంపెనీలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు