కలెక్టర్‌పై లోకాయుక్త విచారణ

వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌పై అందిన ఫిర్యాదులకు లోకాయుక్త స్పందించింది. కడప నగరంతోపాటు జిల్లాలోని నియోజకవర్గాల్లో చేపట్టే వివిధ కార్యక్రమాలపై కలెక్టర్ కె.వి.రమణ వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన లోకాయుక్త విచారణ ప్రారంభించింది.

సోమవారం కడప నగరానికి చేరుకున్న లోకాయుక్త డెరైక్టర్ నర్సింహారెడ్డిని వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంజాద్‌పాషా తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యవహార శైలిపై వారు వివరించారు. ఈ మేరకు నర్సింహారెడ్డి సాయంత్రం కలెక్టర్‌తో రమణతో సమావేశం కానున్నారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top