2022 వరకు బార్లకు లైసెన్సులు
జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు విజన్ 2022 లక్ష్యమని పదే పదే ఊదరగొడతారు. అదే లక్ష్యంగా బార్లకు లైసెన్సులు (ఐదేళ్ల) 2022 వరకు ఇచ్చారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నూతన బార్ పాలసీ ప్రకటించింది. లైసెన్సు ఫీజుల్ని తగ్గిస్తూ.. రిజిస్ట్రేషన్ ఫీజును కొత్తగా అమల్లోకి తెచ్చారు. 30 వేల జనాభాకు ఓ బార్ చొప్పున ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజును చలానా రూపంలో కట్టాలి. ఈ రుసుం తిరిగి ఇవ్వరు. ఆన్లైన్లోనే బార్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు