హక్కుల సేనాని అస్తమయం
హక్కుల సేనాని ఇక లేరు. పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్తో బాధపడుతున్న ఆయన రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్నగర్లోని తన స్వగృహంలో మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనను కిమ్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్పలో బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామికి బొజ్జా తారకం జన్మించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు