ట్వీటర్లోనైనా మాట్లాడుతున్నా
ప్రత్యేక హోదా విషయం లో తాను కనీసం ట్వీట్టర్లోనైనా మాట్లాడు తున్నానని, మన ఎంపీలు పార్లమెంట్లో ఉన్నా ఏమీ మాట్లాడటం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. హోదా సాధించేందుకు అందరూ చిత్తశుద్ధితో పోరాటం చేయాలని కోరారు. తన అను భవం సరిపోదని, ఇతర పార్టీలు ముందు కొస్తే.. తాను కూడా వారితో కలిసి పోరాడు తానన్నారు. అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడి హోదాను సాధించుకోవాల్సిన అవ సరం ఉందన్నారు. ఆయన మంగళవారం విలేకరు లతో మాట్లాడారు. ఏపీకి హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాజకీయ పార్టీల విధివిధానాలు ఎలా ఉన్నా ప్రజా సమస్యలపై కలిసి పోరాడాలని అన్నారు. లోపాలను చాలామంది బహిర్గతం చేసినా ప్రభుత్వం వినకూడదనుకుంటే ఏం చేస్తాం, అందుకే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు