ప్రభుత్వం పట్టింపులకు పోతోంది: జైపాల్
ఛలో మల్లన్నసాగర్ వెళుతున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్ను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్ మల్లన్నసాగర్కు అవసరమా అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని జైపాల్ రెడ్డి హితవు పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు