ఆ ఎమ్మెల్యే ఆస్తులు రూ.500 కోట్లు

రూ.500 కోట్లకు మించి లెక్కచూపని ఆస్తులు కలిగి ఉన్న నారాయణపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ కేసులు నమోదు చేసింది. కర్ణాటకలో ఒక మెడికల్‌ కాలేజీతో పాటు పలు విద్యా సంస్థలు కలిగి ఉన్న రాజేందర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం మేరకు.. ఆదాయ పన్ను శాఖ 2015 డిసెంబర్‌లో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. ఆ దాడుల్లో రూ.20 కోట్ల నగదుతో పాటు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top