ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!

చిన్న సంస్థలకు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఊరటనిచ్చారు. వారిపై వేసే పన్నుపై 5 శాతం తగ్గించారు. రూ.50 కోట్ల టర్నోవర్ వరకున్న కంపెనీలకు వేసే ఆదాయపు పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. నల్లధనం నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేయడంతో ఆర్థికవ్యవస్థ మందగించింది. డిమాండ్లో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్యతరహా సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top