లక్ష కలలను సమాధి చేస్తున్నారు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్లో మండిపడ్డారు. తన రియల్ ఎస్టేట్ కలలను నెరవేర్చుకోడానికి చంద్రబాబు నాయుడు ఓ బ్లూప్రింట్ తయారుచేసుకున్నారని ఆయన అన్నారు.

అయితే ఆ బ్లూప్రింటులో లక్షలాది మంది ప్రజలు, వారి కలలను సమాధి చేస్తుండటాన్ని తాను చూస్తున్నానని ఆయన ఆ ట్విట్టర్ వ్యాఖ్యలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక తదితర ప్రాంతాల్లో భూములను కోల్పోతున్న రైతులు, రైతు కూలీలు, వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్న విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top