నేను చిల్లర దొంగను కాను: శశికళ

పరప్పణ అగ్రహార జైల్లో సాధారణ ఖైదీలా కాలం గడపాల్సి రావడం చిన్నమ్మ శశికళకు బాగా అవమానకరంగా అనిపించింది. దాంతో ఆమె జైలు అధికారులతో ఈ విషయంలో కాస్తంత గొడవ పడినట్లు తెలుస్తోంది. వాళ్లకు.. తాను చిల్లర దొంగను కానని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియా సమాచారం. అందరు ఖైదీల్లాగే తనను జీపులో తీసుకెళ్తామని చెబితే దానికి ఆమె ససేమిరా అన్నారు. దానికంటే లోపలకు నడుచుకుంటూనే వస్తానని చెప్పి.. ఇళవరసి, సుధాకరన్‌లతో కలిసి నడుచుకుంటూనే జైలు ప్రాంగణంలోకి వెళ్లారు. అది ఎంత దూరమైనా తాను నడిచే వస్తాను తప్ప చిల్లర దొంగలను తీసుకెళ్లినట్లు తనను పోలీసు జీపులో తీసుకెళ్తానంటే కుదరదని స్పష్టం చేశారంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top