అమెరికాను వణికిస్తున్న మాథ్యూ హరికేన్
హైతీలోదాదాపు 339 మందిని చంపిన మాథ్యూ హరికేన్.. ఇప్పుడు అమెరికా వైపు వెళ్తోంది. దాంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అత్యంత శక్తిమంతమైన ఈ హరికేన్ అమెరికాలో కూడా విధ్వంసం సృష్టిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైతీలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడంతో నష్టం తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. చెట్లు పడిపోవడం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగి ప్రవహించడంతోనే అక్కడ ఎక్కువ మంది మరణించారు. ప్రధానంగా మత్స్యకార ప్రాంతాల్లోనే మరణాలు ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశానికి నైరుతి దిశలో ఉన్న టుబురాన్ రాష్ట్రంలో నష్టతీవ్రత అధికంగా ఉంది. తన జీవితంలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన హరికేన్ను చూడలేదని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి లూయీస్ పాల్ రాఫెల్ చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు