పల్లెకు పోదాం చలో..చలో..

మహానగరం పల్లె వైపు పరుగులు తీసింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని సంబురాల మధ్య జరుపుకునేందుకు లక్షలాది మంది నగర వాసులు పల్లె తోవ పట్టారు. దీంతో నగరానికి నలువైపులా ఉన్న రహదారులన్నీ పల్లె దారి పట్టాయి. గురువారం స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరారు. గురువారం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. చాలామంది బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడంతో ఉప్పల్, ఎల్‌బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రధాన కూడళ్లు స్తంభించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top