హరహర మహాదేవ.. శంభోశంకర...
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామి వారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకుని తరించారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి ఐదుగంటల సమయం పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి లయకారుడి లింగోద్భవం జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు