రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తుతో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు