హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి చెందిన డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ రిటైల్కి (ఆర్ఆర్ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ డెయిరీ బిజినెస్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు హెరిటేజ్ ఫుడ్స్ గురువారం ప్రకటించింది. '' ఈ డీల్ కు సంబంధించి కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందాం. రిలయన్స్ డెయిరీ బిజినెస్ కొనుగోలును పూర్తిచేశాం'' అని నేడు బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. రిలయన్స్ రిటైల్ దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు నిర్వహిస్తాయని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ రిటైల్ డెయిరీ ప్రొడక్ట్ లను పూర్తిగా తమ సొంతం చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించగానే హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు