మిర్చిధరల పై కేంద్రం స్పందన పెద్ద జోక్
మిర్చి ధరలపై కేంద్రం స్పందించిన తీరు మిలీనియం జోక్ అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల టన్నుల మిర్చి పండితే, కేకవలం 33 వేల టన్నులే కొంటారా అని ఆయన ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలన్న సోయి కేంద్రానికి లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు మార్కెట్లలో తిరుగుతూ క్వింటాలుకు రూ. 10 వేల ధర చెల్లించాలని అంటారని, కానీ కేంద్రం మాత్రం రూ. 5వేలకే కొంటామని చెబుతోందని హరీశ్ గుర్తుచేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు