‘నాతో రాకుంటే.. మీ ఊరిలో అందరికి చెబుతా'

ఓ యువతికి ఓ యువకుడు ఫోన్‌లో పరిచయమయ్యాడు. ఫోన్‌లో నాలుగు రోజులుగా మాట్లాడుకుంటున్నారు. చివరకు ఆ యువకుడు ‘నువ్వు నాతో మాట్లాడుతున్నావని, మీ ఊరిలో ఈ విషయం అందరికి చెబుతానని’ బ్లాక్‌మెయిల్ చేసి యువతిని పెద్దపల్లికి రమ్మన్నాడు. ఆమె రావడంతో బైక్ ఎక్కించుకున్నాడు. వారిని మరో ఇద్దరు యువకులు వెంబడిస్తుండడం చూసి ఆ యువతి బైక్‌పై నుంచి దూకేసిన సంఘటన పెద్దపల్లిలో శుక్రవారం జరిగింది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన 18 ఏళ్ల యువతికి పెద్దపల్లికి చెందిన సాయికుమార్ ఫోన్‌లో నాలుగురోజుల క్రితం పరిచయమయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top