ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!

దేశంలోనే అత్యధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర‍్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్‌ డిసెంబర్‌ చివరి వారంలో ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ సమర్పణ జరిగిన అనంతరం ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top