భారత ఐటీపై ట్రంప్ పిడుగు పడింది!!
అంతా భయపడ్డట్టే జరిగింది! భారత ఐటీపై ట్రంప్ పిడుగు పడింది!! వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచానికి వరుస షాక్లు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వీసా బాంబు పేల్చారు. భారత ఐటీ ఉద్యోగులు, కంపెనీల్ని టార్గెట్ చేస్తూ హెచ్–1బీ వీసాలపై పలు కఠిన నిబంధనలు విధించారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును మంగళవారం అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం... హెచ్–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల వేతనాన్ని రెండింతలు పెంచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారి స్థానంలో తప్పనిసరిగా అమెరికన్లనే నియమించాలి. ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్లోని ఉభయ సభలు ఆమోదిస్తే భారత ఐటీ రంగానికి శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు