ట్రంప్‌ టీమ్‌లోకి శక్తిమంతమైన మహిళ

అమెరికాలోని ఉద్యోగాల్లో అధికశాతం స్వదేశీయులకే దక్కేలా చేస్తాన్న వాగ్ధానంతో అధ్యక్షుడిగి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌.. ఆ హామీ అమలుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అమెరికాలో కంపెనీల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో అధ్యక్షుడికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకుగానూ విభిన్న రంగాలకు చెందిన టాప్‌మోస్ట్‌ కంపెనీల సీఈవోలతో ఒక ఉన్నతస్థాయి వేదికను ఏర్పాటుచేశారు. ‘వ్యూహాత్మక, విధాన వేదిక’(strategic and policy forum)గా పిలిచే ఈ వేదికలోకి భారత సంతతి మహిళ, ప్రస్తుత పెప్సీకో సీఈవో ఇంద్రనూయికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 19 మంది సభ్యులున్న ఈ వ్యూహాత్మక, విధాన వేదికలో ఇంద్రనూయి ఒక్కరే భారత సంతతికి చెందినవారు కావడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top