ప్రధాని మోదీపై రాహుల్‌ సంచలన ఆరోపణలు

ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్‌ బాంబు పేల్చారు. మోదీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని చెప్పారు. మోదీకి ముడుపులు ఇచ్చినట్టు బిర్లా కంపెనీ కూడా చెప్పిందని రాహుల్‌ వెల్లడించారు. 2013లో అక్టోబరు 30న 2.5 కోట్లు, అదే ఏడాది నవంబర్‌ 12న 5 కోట్లు, నవంబర్‌ 27న 2.5 కోట్ల రూపాయలను బిర్లా కంపెనీ మోదీకి ఇచ్చిందని రాహుల్‌ చెప్పారు. బుధవారం గుజరాత్‌లోని మెసానాలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top