‘ఆ ఘటనతోనే శిరీషకు మనస్తాపం’
బ్యుటీషియన్ శిరీష మృతి ముమ్మాటికీ ఆత్మహత్యేనని వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. కుకునూర్పల్లిలో జరిగిన ఘటనతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని మంగళవారం ఆయన విలేకరులతో చెప్పారు. ఆమెపై అత్యాచారం జరిగిందా, లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికతో తేలుతుందని, రిపోర్టు కోసం వేచిచూస్తున్నామన్నారు. శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్లను విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ప్రకారం శిరీష ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. శిరీష తన ఫోన్లో పంపించిన గూగుల్ లోకేషన్ను పూర్తిగా పరిశీలించినట్టు వెల్లడించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు