రంగారెడ్డి జిల్లాలో విషాదం
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంచాల మండలం రంగాపూర్లో గురువారం అర్ధరాత్రి దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
గ్రామ శివారులో పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తున్న మోహన్ చారీ(44), సరిత(38) దంపతులు గురువారం రాత్రి అక్కడే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు కలగకపోవడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు